తెలంగాణ

Ranganath: ఓవర్ యాక్షన్ చేయొద్దు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫైర్

Ranganath: అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు ప్లాట్ల కొలతలు, అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఆపై హైడ్రా కమిషనర్ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీం, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ముచ్చటిస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.

ఈ నేపథ్యంలో తెలుగు వచ్చా? అని ప్రశ్నించారు ముఖీం. అందుకు రంగనాథ్ స్పందిస్తూ. మీరు చెప్పేది మీరు చెప్పండి ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు అని ముఖీంను హెచ్చరించారు. ఇతర సభ్యులు దీనిపై కూడా చర్చ చేశారు. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై భాదితులు వాదనలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button