తెలంగాణ
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు

సికింద్రాబాద్లో కాంగ్రెస్ విజయోత్సవ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వడం కుదరదని ఆయన కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దాదాపు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్నారు. మిగిలి ఉన్న రెండు హామీలలో మహిళలకు నెలకు రెండు వేల పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే అమలు చేస్తామన్నారు. కానీ ప్రతి మహిళకు కాదు..ఇంటికో మహిళకు మాత్రమే ఇస్తామని వీహెచ్ స్పష్టం చేశారు.



