జాతియం
Madhya Pradesh: స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి

Madhya Pradesh: మధ్యప్రదేశ్లో లో ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో స్టేజ్పై ఓ యువతి డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వధువుకు చెల్లి అయిన ఆ యువతి హఠాన్మరణంతో పెళ్లింట విషాదం నెలకొంది. యువతి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన దృశ్యాలు కెమరాలో రికార్డు కావడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.