తెలంగాణ
ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదులపై విజయానికి గుర్తుగా రాఖీ తయారీ

జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ రాఖీని తయారుచేశారు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు. ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదులపై విజయానికి గుర్తుగా 8 మంది విద్యార్థినులు రక్షాబందన్ సందర్భంగా రాఖీని తయారు చేశారు. రాఖీని పోస్ట్లో ప్రధాని మోదీకి పంపించారు. రాఖీపై ఆకాశ్, బ్రహ్మోస్, రాఫెల్, ఎస్ 400 చిత్రాలను ముద్రించడంతో పాటు జాతీయ పతాకాన్ని సూచించే మూడు రంగుల రిబ్బన్ను జత చేశారు విద్యార్థినులు.



