అంతర్జాతీయం

Bus Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి

Bus Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఉయుని, కొల్చాని రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. వీటిలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button