తెలంగాణ
మలక్పేటలో వివాహిత అనుమానాస్పద మృతి

Hyderabad: హైదరాబాద్ మలక్పేటలోని జమున టవర్స్లో వివాహిత అనుమానస్పద మృతి చెందింది. శిరీషకు గుండెపోటు వచ్చిందన్న అత్తింటి ఫ్యామిలీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఎవరికీ చె ప్పకుండా మృతదేహాన్ని తరలిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు శిరీష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త వినయ్, అత్తమామలు కొట్టి చంపారన్న శిరీష ఫ్యామిలీ ఆరోపిస్తుంది. శిరీష మృతదేహంపై గాయాలున్నాయని ఫిర్యాదు చేశారు బాధితులు. హైదరాబాద్ మలక్పేటలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.