తెలంగాణ

Hyderabad: మండుతున్న ఎండలు.. నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత

Hyderabad: 5 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుండటంతో కంటోన్మెంట్ ప్రజలు అల్లాడుతున్నారు. నీటి సరఫరా విషయంలో అటు కంటోన్మెంట్, ఇటు వాటర్​బోర్డ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. కంటోన్మెంట్​ప్రజల మంచినీటి కష్టాలు తీరకపోగా మరింత ఎక్కువయ్యాయి.

నాలుగైదు కంటోన్మెంట్ పరిధిలో మంచినీటి వినియోగం పెరగడంతో డిమాండ్​కు అనుగుణంగా నీటి సరఫరాను పెంచాలని వాటర్​బోర్డును కంటోన్మెంట్​బోర్డు అధికారులు కోరారు. అయితే నల్లా కనెక్షన్ ఛార్జీలను గత కొంత కాలంగా బోర్డు తమకు చెల్లించడం లేదని, ఆ చార్జీలు చెల్లిస్తేనే నీటి సామర్థ్యాన్ని పెంచుతామంటూ వాటర్​బోర్డ్​ అధికారులు భీష్మించారు.

దీంతో కంటోన్మెంట్​ప్రాంతంలో నాలుగు రోజులకోసారి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు నిత్యం సరఫరాలో కలిగే అంతరాయం, షట్​డౌన్​లు కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. బోర్డు సమీపంలోని జీహెచ్​ఎంసీ పరిధిలో ప్రతి రోజు నీటి సరఫరా జరుగుతుండగా.. తాము మాత్రం అల్లాడుతున్నామని కంటోన్మెంట్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button