Hyderabad: మండుతున్న ఎండలు.. నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత

Hyderabad: 5 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుండటంతో కంటోన్మెంట్ ప్రజలు అల్లాడుతున్నారు. నీటి సరఫరా విషయంలో అటు కంటోన్మెంట్, ఇటు వాటర్బోర్డ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. కంటోన్మెంట్ప్రజల మంచినీటి కష్టాలు తీరకపోగా మరింత ఎక్కువయ్యాయి.
నాలుగైదు కంటోన్మెంట్ పరిధిలో మంచినీటి వినియోగం పెరగడంతో డిమాండ్కు అనుగుణంగా నీటి సరఫరాను పెంచాలని వాటర్బోర్డును కంటోన్మెంట్బోర్డు అధికారులు కోరారు. అయితే నల్లా కనెక్షన్ ఛార్జీలను గత కొంత కాలంగా బోర్డు తమకు చెల్లించడం లేదని, ఆ చార్జీలు చెల్లిస్తేనే నీటి సామర్థ్యాన్ని పెంచుతామంటూ వాటర్బోర్డ్ అధికారులు భీష్మించారు.
దీంతో కంటోన్మెంట్ప్రాంతంలో నాలుగు రోజులకోసారి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు నిత్యం సరఫరాలో కలిగే అంతరాయం, షట్డౌన్లు కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. బోర్డు సమీపంలోని జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి రోజు నీటి సరఫరా జరుగుతుండగా.. తాము మాత్రం అల్లాడుతున్నామని కంటోన్మెంట్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.