ఆంధ్ర ప్రదేశ్
Kakinada: మెడికల్ కాలేజీలో కలకలం.. ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Kakinada: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. అర్దరాత్రి ఒంటిగంట సమయంలో బాలుర హాస్టల్లో.. ఫ్యాన్కు ఉరేసుకొని రావూరి సాయిరాం ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో సాయిరాం ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.