వ్యాపారం
Stock Market: నష్టాలలో ముగిసిన దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా- చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు, అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి.
దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తుండడం సూచీలు నష్టాలకు కారణమయ్యాయి. నిఫ్టీ 23వేల700 దిగువన ముగిసింది. సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది.