ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి నీటి విడుదల

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. అధికారులు 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2లక్షల 32 వేల 290 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 2లక్షల వేయ్యి 743 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 883 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 204 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.