ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమంలో వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.