News
భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకం

Bhadrachalam: భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములవారికి నేడు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల 30నిమిషాలకు కన్నుల పండువగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. మహాపట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.