ఆంధ్ర ప్రదేశ్
కత్తితో పొడిచి.. మామను హత్య చేసిన అల్లుడు

Srikakulam: శ్రీకాకుళం జిల్లా మండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మామను అల్లుడు దాసు చంపేశాడు. మామ గంగయ్యపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. సైకిల్పై వెళ్తున్న మామ గంగయ్యను అడ్డగించి మరీ కత్తితో పలుమార్లు పొడిచాడు అల్లుడు దాసు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబకలహాలే హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.