జాతియం
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఆపరేషన్ మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడంలో కీలక ముందడుగు అని పోలీసు అధికారులు వెల్లడించారు.ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్స్, స్టెన్ గన్స్,.303 రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.



