ఆంధ్ర ప్రదేశ్

Police Custody: నాలుగో రోజు సిరాజ్, సమీర్ పోలీస్ కస్టడీ

Police Custody: విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. ఏడురోజుల కస్టడీలో భాగంగా ఇవాళ నాలుగో రోజు నిందితులు సిరాజ్, సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు సిరాజ్, సమీర్ సోషల్ మీడియా ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణలో భాగంగా నిందితుల స్టేట్‌మెంట్‌ను NIA టీమ్ రికార్డు చేస్తోంది.

కాగా.. మూడోరోజు విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. నిందితులు సిరాజ్, సమీర్‌ ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, విజయనగరంతోపాటు ఏడు చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది.

గత 6 నెలలుగా హైదరాబాద్‌లోనే సమీర్‌తోపాటు విజయనగరం వాసి సిరాజ్‌ ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. సిరాజ్, సమీర్ ఓవర్గం వారినే లక్ష్యంగా చేసుకోని పేలుళ్లకు కుట్ర పన్నిన్నట్లు విచారణలో తేలింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button