తెలంగాణ
కోటిలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హరీష్ రావు

Harish Rao: శివుడు పేరిట కేసీఆర్ ఎన్నో హోమాలు, యాగాలు చేసి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలోని ఉమా పార్థివ కోటిలింగేశ్వర మిట్టపల్లిలో చెన్నకేశవ ఆలయాల్లో హరీష్ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పసిడి పంటలు పండేలా ఆశీర్వదించాలని శివయ్య ను కోరకున్నానని హరీష్ రావు తెలిపారు. కెసిఆర్ శివుడు పేరిట ఎన్నో హోమాలు చేసి మిషన్ భగీరథ అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు.