తెలంగాణ

Hyderabad : మలక్పేట శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

Hyderabad: హైదరాబాద్ లోని మలక్ పేట్‌లో శిరీష హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను ఆమె భర్త వినయ్ కుమార్, ఆడపడచు కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. శిరీష కన్నా ముందు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్న వినయ్ కుమార్ మొదటి భార్యను కూడా ఇలాగే హత్య చేశాడని వెల్లడైంది.

అలాగే రెండో భార్య అతని వేధింపులు భరించలేక ఇల్లు వదిలి పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అయితే శిరీషను కూడా భర్త ఆయన సోదరి కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధించారు. తల్లిదం డ్రులు, బంధువుల అండదండలు లేని శిరీష వారి వేధింపులను చాలాకాలం మౌనంగా భరించింది. ఇటీవల వేధింపులు మరీ ఎక్కువ కావడంతో భర్తతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి శిరీషకు, ఆమె ఆడపడుచు సరితకు మధ్య గొడవ తలెత్తింది. ఇద్దరూ ఒకరిని ఒకరు తీవ్రస్థాయిలో పరుష పదజాలతో దుర్భాషలా డుకున్నారు. క్షణికావేశానికి గురైన ఆడపడుచు శిరీషను కొట్టింది. దీంతో శిరీషను వదిలించుకోవాలని ప్లాన్‌తో ఆమె మత్తు ఇంజిక్షన్ ఇచ్చి గొంతునులిమి, దిండుతో ఊపరిడాకుండా చంపేశారు.

అనంతరం గుండెపోటుతో చనిపోయినట్టు కథ అల్లారు శిరీష మృతదేహాన్ని దహనం చేసేందుకు వెళ్తుండగా ఆమె మేనమామ మధుకర్ ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. శిరీషకు తల్లిదండ్రులు లేరని పథకం ప్రకారమే ఆమెను ప్రేమిస్తున్నట్టు నటించి పెళ్లి చేసుకున్నాడని పోలీసులు విచారణలో తెలినట్టు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button