అల్లు అరవింద్కు షాకింగ్ నోటీసు!

Allu Aravind: మెగా నిర్మాత అల్లు అరవింద్కు హైదరాబాద్లో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్లోని అల్లు బిజినెస్ పార్క్లో చట్టవిరుద్ధంగా పెంట్హౌస్ నిర్మాణం చేశారని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసు జారీ చేశారు. నాలుగు అంతస్తులకు అనుమతి ఉండగా, అదనంగా పెంట్హౌస్ నిర్మించారని ఆరోపణ. దీనిపై అల్లు అరవింద్ స్పందన ఇంకా రాలేదు. పూర్తి వివరాలు చూద్దాం.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అల్లు బిజినెస్ పార్క్లో అనధికార పెంట్హౌస్ నిర్మాణం గుర్తించిన జీహెచ్ఎంసీ, అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నిర్మాణం ఎందుకు కూల్చకూడదని వివరణ కోరింది. అల్లు కుటుంబం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. కొకాపేటలో వారు నిర్మించిన ఫిల్మ్ స్టూడియోతో పాటు, కొత్త థియేటర్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ నోటీసు అల్లు అరవింద్కు చిక్కులు తెచ్చే అవకాశం ఉంది.



