క్రీడలు
విరాట్ కోహ్లీకి ఊహించని షాక్.. బెంగళూరులో కేసు నమోదు

Virat Kohli: టీమిండియా బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులోని వన్ 8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కస్తూర్బా రోడ్డులోని విరాట్ కోహ్లీ వన్ 8 పబ్పై కబ్బన్ పార్క్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనకు విరుద్ధంగా పబ్లో స్మోకింగ్ చేసేందుకు సపరేట్ ఏరియా లేకపోవడాన్ని వారు గుర్తించారు.
ఈ మేరకు నిబంధనలు అతిక్రమించినందుకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టంలోని సెక్షన్-4, 21 ప్రకారం వన్ 8 పబ్ మేజేజర్తో పాటు సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లుగా కబ్బన్ పార్క్ ఎస్సై అశ్విని తెలిపారు.