ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో భక్తుల కిటకిట

మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం, సిద్దేశ్వరం, భైరవకోన,జొన్నవాడ సయబక్షేత్రాలకు విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిచయజేశారు.