తెలంగాణ
Vemulawada: రాజరాజేశ్వర ఆలయంలో శివ దీక్షలు ప్రారంభం

Vemulawada: సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు 300 మంది శివ భక్తులు దీక్షలు చేపట్టారు. ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయం మార్మోగింది.
దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు. దీక్ష సమయంలో మంచి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పారు.