Karre Gutta: కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

Karre Gutta: ఐదు రోజుల నుండి కర్రెగుట్టలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులపై పై చేయి సాధించే దిశగా భద్రతా బలగాలు దూసుకుపోతున్నాయి. శనివారం సాయంత్రం కర్రేగుట్టలపై మావోయిస్టులు స్థావరంగా ఉపయోగించిన ఒక గుహను బలగాలు కనుగొన్నాయి. ఆ గుహలో విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యాలతో పాటు నీటి వసతి ఉండడం గుర్తించారు భద్రతా బలగాలు. అయితే భద్రత బలగాలు గుహలు చేరేటప్పటికే.. మావోయిస్టులు అక్కడినుండి తప్పించుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో గుట్టపై ఉన్న మావోయిస్టులు కిందికి రాలేని పరిస్థితి. కిందికి వస్తే ప్రాణాలు కోల్పోతారు. గుట్ట పైనే ఉంటే మావోయిస్టుల వద్ద ఉన్న ఆహార పదార్థాలు అయిపోయి.. ఆహారం లేక నీరసించి డిహైడ్రేషన్ కు గురై చనిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో రణమా, శరణమా తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.