Karregutta: కర్రెగుట్టపై భద్రతా బలగాల పట్టు

Karregutta: కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాలు వేట ప్రారంభించి నేటితో పది రోజులైంది. ఈ క్రమంలోనే కర్రెగుట్టపై భద్రతా బలగాల పట్టు సాధించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భద్రతా బలగాల ఆధీనంలో రెండు గుట్టలు చేరాయి. మరోవైపు కర్రెగుట్టలపై బలగాలు జాతీయ జెండాను ఎగురవేశాయి. అంతేకాదు శాశ్వత బేస్ క్యాంప్లు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రస్తుతం కర్రెగుట్టలో 20వేల మందికిపైగా బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. రాయ్పూర్ నుంచి ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు ఐబీ చీఫ్. ముఖ్యంగా హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు పలువురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన బలగాలకు, మావోయిస్టుల కీలక నేతల ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఇక తాము ఎంచుకున్న ఆపరేషన్ కగార్ పూర్తయ్యేవరకు పట్టువిడవబోమంటున్నారు భద్రతా బలగాలు. మరోవైపు మావోయిస్టులు ఆపరేషన్ కగార్ నిలిపివేసి చర్చలకు పిలవాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది.