తెలంగాణ
బడికి వేళాయె..!

తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. అయితే ఈ ఏడాది నుండి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా స్కూళ్లలో మౌలిక వసతులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ స్కూల్లో కూడా డిజిటల్ క్లాసుల్ని ఏర్పాటు చేశారు.
50 రోజుల తర్వాత విద్యార్థులు బడిబాట పట్టడంతో ఇప్పటికే అవగాహన ప్రోగ్రామ్స్ చేపట్టిన ప్రభుత్వం, విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేస్తుంది. 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేయగా ఈ ఏడాది మొత్తం 230 పని దినాల్ని ఖరారు చేసింది.