ఆంధ్ర ప్రదేశ్
Satya Kumar Yadav: అవసరం లేకుండానే ఎక్సరేలు, స్కానింగ్లు తీస్తున్నారు

Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారిందన్నారు. డాక్టర్లు రోగులను మానవతా దృష్టితో చూడాలన్నారు. వైద్య వృత్తి విలువలు పల్చబడ్డాయన్నారు.
అవసరం లేకుండానే ఎక్సరేలు, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్లు తీస్తున్నారని ఆయన అన్నారు. నార్మల్ డెలివరీ చేయడం మానేసి అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు నార్మల్ డెలివరీస్ చేస్తే బాగుటుందన్నారు.