సమంత నిర్మాతగా ‘శుభం’.. ట్రైలర్ రిలీజ్కు రెడీ!

Samantha: స్టార్ బ్యూటీ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన ‘ట్రాలాలా’ నిర్మాణ సంస్థ బ్యానర్లో తొలి చిత్రం ‘శుభం’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్పై సామ్ తాజా అప్డేట్ ఇచ్చింది. మరి, ఈ సినిమా విశేషాలు ఏంటో చూద్దాం.
సమంత నిర్మాతగా సరికొత్త ప్రయాణం మొదలైంది. ‘ట్రాలాలా’ బ్యానర్లో రూపొందుతున్న ‘శుభం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ కామెడీ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్గా నిలవనుంది.
ఈ చిత్రాన్ని మే 9న వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు సమంత సన్నాహాలు చేస్తోంది. తాజాగా, ‘శుభం’ ట్రైలర్ గురించి సామ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ “ట్రైలర్ ఎప్పుడైనా, ఏ రోజైనా రావచ్చు” అంటూ ఉత్కంఠ రేపింది. దీంతో ట్రైలర్ రిలీజ్పై అంచనాలు మరింత పెరిగాయి. సమంత తొలి నిర్మాణంలో ‘శుభం’ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.