ఆంధ్ర ప్రదేశ్
Sajjala: రెడ్బుక్ పాలన పేరుతో పథకం ప్రకారమే అక్రమ కేసులు

Sajjala: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం టీడీపీ ప్రభుత్వానికి పరిపాటి అన్నారు సజ్జల. రాజ్యాంగాన్నిఅడ్డుపెట్టుకొని ప్రభుత్వం నియంత పాలన వ్యవహరించడం దారుణమన్నారు.
కేవలం దౌర్జనానికి తెగబడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందన్నారు. రెడ్ బుక్ పాలన పేరుతో పధకం ప్రకారం వైసీపీ నేతలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతున్నారని సజ్జల ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రతిఒక్కరూ సంయమనంగా ఉంటున్నారని ఆయన వెల్లడించారు.