News

Sajjala Ramakrishna Reddy: ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి

Sajjala Ramakrishna Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్ర పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్‌ చేస్తున్నారని, జగన్‌ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేశామని, ప్రజలను రక్షించేవారే అరాచక శక్తులు గా మారారంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

భూముల కోసం శాతవాహన కాలేజీని కూల్చేశారని, ఎమ్మెల్సీని కిడ్నాప్‌ చేసినట్టు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సమర్థులైన అధికారులను వీఆర్‌లో ఉంచుతున్నారని, తెనాలిలో యువకులపై బహిరంగంగా దాడి చేసిన పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button