ఆంధ్ర ప్రదేశ్
Sajjala Ramakrishna: సజ్జల కుటుంబంపై విచారణకు పవన్ ఆదేశం..

Sajjala Ramakrishna: సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలపై వెంటనే విచారణ చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జా రీ చేశారు. 52 ఎకరాల చుక్కల భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు కబ్జా చేశారనే ఆరోపణలు కొన్ని రోజులుగా గుప్పుమంటున్నాయి.
పేదలు, ప్రభుత్వ భూముల జోలికి ఎవ్వరూ వచ్చిన సహించేది లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు విచారణకు ఆదేశించి కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.