తెలంగాణ

Sabitha Indra Reddy: కేసీఆర్ మిషన్ భగీరథ తెస్తే.. రేవంత్ పాత రోజులను తెచ్చారు

Sabitha Indra Reddy: రుద్రమదేవి, సమ్మక్క సారలక్క లాంటి వీరవనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ మహిళల పరువును ప్రపంచం ముందు తీసిన ఘటన ఇది అన్నారు.

తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, టవల్‌తో తుడిపించడం దుర్మార్గమైన చర్య అన్నారు. యావత్ మహిళా లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోటిమంది మహిళలు కోటీశ్వరులను చేస్తామని చెప్పి ఇలాంటి చర్యలు దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్ భగీరథతో మహిళల నీటి కష్టాలు తీరిస్తే, ఇప్పుడు బిందెలతో కష్టాలు తెచ్చి పాతరోజులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కానీ ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ఒక్కరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button