తెలంగాణ

మంత్రి పొన్నంను కలిసిన ఆర్టీసీ INTUC నేతలు

తెలంగాణ RTC కార్మికులు సమ్మెకు దిగుతామన్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను INTUC నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను పొన్నంకు వివరించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని INTUC నేతలకు చెప్పారు పొన్నం. ఇక ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇక ఏ సంఘాలైన ఆర్టీసీ సమస్యల గురించి తమతో చర్చించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు.

మరోవైపు తమ ఉద్యోగులకు RTC యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి విజ్ఞప్తి చేసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని లేఖలో పేర్కొంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామంది ఆర్టీసీ యాజమాన్యం.

ఇప్పటికైనా చర్చలకు పిలవకపోతే సమ్మె తథ్యం అంటోంది TGSRTC జేఏసీ. ఈరోజు అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే రేపు ఉదయం నుంచే సమ్మెకు దిగుతామన్న RTC జేఏసీ. ఈ నేపథ్యంలో ఏజరుగుతోందనని ఉత్కంఠ నెలకొంది. TGSRTC జేఏసీ పిలుపుతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button