ఆంధ్ర ప్రదేశ్

Road Accident: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident: కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు.

మృతులను రాజమహేంద్రవరానికి చెందిన గెడ్డం రామరాజు, హాజరత్ వాలీ, తణుకుకు చెందిన వరాడ సుధీర్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ గోనా శివశంకర్, వెంకట సుబ్బారావును చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న విశాఖలో జరిగిన సమావేశానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీ విశాఖ నుంచి మండపేటకు ఐరన్ లోడ్‌తో వెళ్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button