ఓవర్ స్పీడ్తో కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న మినీ వ్యాన్

ఉప్పల్ లోని బీరప్ప గడ్డ వద్ద నిన్న సాయంత్రం ఓవర్ స్పీడ్ తో మినీ వ్యాన్ బాలిక పైకి దూసుకొని వచ్చి,కరెంట్ స్తంభానికి ఢీకొంది. బాలిక తప్పించు కోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఉండడంతో పోలీసులు ఎవరు అందుబాటులో లేరు.
మినీ వ్యాన్ ఓనర్ కరెంట్ స్తంభానికి అయ్యే ఖర్చు ఇచ్చి వ్యాన్ తీసుకొని వెళ్ళిపోయాడు దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి వారిని గుర్తించి పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
ఉప్పల్లోని బీరప్పగడ్డ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన మినీ వ్యాన్ రోడ్పై నిలబడి ఉన్న బాలిక పైకి దూసుకొచ్చింది. బాలిక హుటాహుటిన తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక అదే స్పీడ్తో వచ్చిన వ్యాన్ ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం నేలకు ఒరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.