తెలంగాణ
Road Accident: టిప్పర్ లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు

Road Accident: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె చెరువు దగ్గర టిప్పర్ లారీని బైక్ ఢీకొంది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. టిప్పర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది.