ఆంధ్ర ప్రదేశ్
Nellore: కారు బీభత్సం.. ఆరుగురు మృతి

Nellore: నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఆ మెడికోల తిరుగు ప్రయాణం విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ, పక్కనే ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం సమీపంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమవగా అందులో నివసిస్తున్న వెంకటరమణయ్య మృతి చెందారు. కారులో ఆరుగురు వైద్య విద్యార్థులు ఉండగా, ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురిని నెల్లూరులోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు విడిచారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.