తెలంగాణ
Medak: రోడ్డుప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. 11 మందికి తీవ్ర గాయాలు

Medak: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రావెల్స్ బస్సును డీసీఎం ఢీకొట్టింది. పెద్దశంకరంపేట మండలం కొలపల్లి దగ్గర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద తుల్జాపూర్ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా విజయనగరం వాసులుగా గుర్తించారు.