తెలంగాణ
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Accident: పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో ఆగి ఉన్న ట్యాంకర్ను ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో కండక్టర్ సీతారాం ప్రసాద్ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.