జాతియం
Road Accident: ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఆరుగురు మృతి

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని చికిత్స నిమి త్తం ఆసుపత్రికి తరలించారు. కోలారు జిల్లా హోస్కోటే వద్ద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.