ఆంధ్ర ప్రదేశ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను.. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. నారా కోడూరు- బుడంపాడు గ్రామాల మధ్య ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుద్ధపల్లి నుంచి కూలి పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆటోలో 11 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతులు అరుణ, నాంచారమ్మ, సీతారావమ్మలుగా గుర్తించారు.