ఆంధ్ర ప్రదేశ్
Gannavaram: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని లారీ ఢీకొట్టింది. లారీ చక్రాలు ద్విచక్ర వాహనదారుడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే వ్యక్తి మరణించాడు.
మృతి చెందిన వ్యక్తి బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన గరికపాటి సుబ్బారావు రిటైర్డ్ రైల్వే ఉద్యోగిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



