ఆంధ్ర ప్రదేశ్
Road Accident: ఆటోను ఢీ కొట్టిన కారు.. 18 మందికి గాయాలు

Road Accident: బాపట్ల జిల్లా చిన్నగంజాం వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీల ఆటోను కారు ఢీకొన్న ఘటనలోళ18 మందికి గాయాలయ్యాయి. చీరాల మండలం బోయినవారిపాలెంకు చెందిన మహిళలు ఒంగోలు సమీపంలోని ప్రసంగిపాడు గ్రామంలో మిరకాయలు కోతకు వెళ్లారు. అయితే తిరిగి చీరాల వస్తుండగా చిన్నగంజాం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది.
దీంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 18 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుకున్న స్థానిక ఎమ్మెల్యే కొండయ్య హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.