తెలంగాణ

Revanth Reddy: భూభారతి అనేది పేద రైతుకు చుట్టం

Revanth Reddy: హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జూన్ 3నుంచి 20 వరకూ మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు.

అధికారులు, కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు 12వేల 184 కోట్లు చెల్లించామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button