Revanth Reddy: క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్

Revanth Reddy: క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయిచరణ్ క్యాన్సర్ బారినపడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు ఇంటిని అమ్మేశారు.
అయినప్పటికీ చికిత్సకు అవసరమైనంత డబ్బులు సరిపోకపోవడంతో సీఎంను కలిసి గతంలో తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చలించిన రేవంత్ రెడ్డి సాయిచరణ్ చికిత్సకు 5 లక్షలు మంజూరు చేశారు.
అలాగే చికిత్సకు అదనంగా వ్యయమైన మరో 7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని ఆదేశించడంతో ఆ మొత్తాన్ని అధికారులు అందజేశారు. చికిత్స చేయించుకున్న సాయిచరణ్ కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయిచరణ్కు సూచించారు సీఎం.