తెలంగాణ

Revanth Reddy: బీసీలకు విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో న్యాయమే లక్ష్యం

Revanth Reddy: జెండా అజెండాలు పక్కన పెట్టి బీసీ బిల్లుకు సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ కోటాపై పార్టీలకతీతంగా ప్రధాని మోడీని కలుద్దామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలుకు తాను నాయకత్వం వహిస్తానన్నారు రేవంత్. కిషన్ రెడ్డి,బండి సంజయ్, బీజేపీ నేతలు ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించాలన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కోటా ఆమోదం పొందేలా పోరాడుదామన్నారు.

మనమంతా కలిసి కట్టుగా ఉన్నామని సంకేతం ఇవ్వాలన్నారు రేవంత్. బీసీ జనాభా 56 శాతమని కులగణనలో తేల్చామన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాజకీయంగా కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. వివాదాలకు తావులేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నారు. బీసీలకు విద్యా,ఉద్యోగాలు, రాజకీయాల్లో న్యాయమే తమ లక్ష్యమని అన్నారు సీఎం రేవంత్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button