తెలంగాణ

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Revanth Reddy: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం.

రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఎన్ హెచ్ 765లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని రేవంత్ కోరారు. అలాగే హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని కోరారు సీఎం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button