తెలంగాణ

గూగుల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

Revanth Reddy: ఇండియాలో మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‎ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ మాది ఇన్నోవేటివ్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన జీవితాలన్నీ డిజిటల్‎గా మారాయని మన ఎకానమీ గవర్నమెంట్ అన్ని డిజిటల్ అయ్యాయని తెలిపారు. దీంతో డిజిటల్‎గా సెక్యూర్‎గా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని దీనికి ఆనంద్ మహీంద్రా చైర్మెన్‎గా ఉంటున్నారని తెలిపారు. సర్టిఫికేట్‎లు ఒక్కటే కాదని యువతకు నైపుణ్యాన్ని కూడా అందించాలని కోరారు.

మీది (గూగుల్) ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియాలో మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‎ను బుధవారం (జూన్ 18) హైదరాబాద్‎లో సీఎం రేవంత్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం (జూన్ 18) మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు, గూగుల్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితాలన్నీ డిజిటల్‎గా మారాయని మన ఎకానమీ గవర్నమెంట్ అన్ని డిజిటల్ అయ్యాయని తెలిపారు. దీంతో డిజిటల్‎గా సెక్యూర్‎గా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని దీనికి ఆనంద్ మహీంద్రా చైర్మెన్‎గా ఉంటున్నారని తెలిపారు. సర్టిఫికేట్‎లు ఒక్కటే కాదని యువతకు నైపుణ్యాన్ని కూడా అందించాలని కోరారు. రాష్ట్రంలోని- కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చబోతున్నామని చెప్పారు.

గూగుల్ క్యాంపస్ 2 ఎకరాల్లో ఉంది కానీ మా మహిళల క్యాంపస్ మీ ఆఫీసు ముందు మూడున్నర ఎకరాల్లో ఉందని వాళ్ళే మీ కాంపిటీటర్స్ అని అన్నారు. ట్రాన్స్ జెండర్స్‎కు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ వ్యవస్థలోకి తీసుకున్నామని గుర్తు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button