తెలంగాణ
Revanth Reddy: చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్టు

Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, కేసీఆర్ పై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. చెల్లని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్టు అన్నారు. పదేళ్ల పాలనలో తండ్రీ కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఏమి లేదన్నారు. కేంద్రం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున అడుగుతున్నామన్నారు.
బడ్జెట్ లో పరిమిత కేటాయింపులు ఉంటాయని సదరన్ పార్టీకి నిధులు ఎవరిస్తారో కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు రింగ్ ఉంటేనే రింగ్ రోడ్డు అంటారని సగం చేసి రింగురోడ్ అంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో లేదని భూసేకరణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి పాటిస్తుందని విమర్శించారు. భూసేకరణ చేయట్లేదని అంటారు వద్దని కూడా వాళ్లే అంటారని చురకలేశారు.