తెలంగాణ

Revanth Reddy: జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ

Revanth Reddy: జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. యుమెషిమాలో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాసేపట్లో జపాన్ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇక రేపు ఒసాకి నుంచి హిరోషిమాకు ముఖ్యమంత్రి రేవంత్ బృందం వెళ్లనుంది.

ప్రతి ఐదేళ్లకు ఓసారి ఒసాకో ఎక్స్‌పో నిర్వహిస్తారు. ఒసాకో ఎక్స్‌పోలో పాల్గొన్న మన దేశంలోని తొలిరాష్ట్రం తెలంగాణ కావటం విశేషం. అంతేకాదు ఒసాకో ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు అండ్ పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలాల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెబుతోంది.

తెలంగాణ పెవిలియన్‌లో తెలంగాణలో సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button