జాతియం
Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

Rekha Gupta: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా పర్వేశ్వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్సింగ్, రవీందర్, కపిల్మిశ్రా, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వీరితో ప్రమాణం చేయించారు.
27 ఏళ్ల తర్వాత దిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ.. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పాల్గొన్నారు.