తెలంగాణ
Vikarabad: హాస్టల్లో బాలికలను కొరికిన ఎలుకలు

Vikarabad: వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఎలుకల కలకలం రేపింది. 8 మంది బాలికలను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 22న నలుగురు బాలికలను ఎలుకలు కొరకగా గత నెల 27న మరోసారి నలుగురు బాలికలను ఎలుకలు కొరికాయి.
హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలపై ఎలుకలు దాడి చేస్తున్నాయని విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడ్డుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.